హైకోర్టు తీర్పుతో కాళేశ్వరంపై నిజం గెలిచింది
మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
జడ్చర్ల, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధిం చి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల రాష్ట్ర మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఒక ప్రకటన లో మాజీ మంత్రి మాట్లాడారు కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడంతో న్యాయం గెలిచిందన్నారు.
తెలంగాణను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్పై కాంగ్రెస్, బీజేపీలు అడ్డగోలుగా విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొం దారని, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. న్యాయస్థానాలపై నమ్మకంతో కేసీఆర్, హరీష్ రావు పోరాడగా చివరకు నిజం గెలిచిందని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు కోర్టు తీర్పుతోనైనా కాంగ్రెస్, బీజేపీలకు కనువిప్పు కలగా లని మాజీ మంత్రి ఆకాంక్షించారు.






