26 April, 2026 | 8:42 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

పకడ్బందీగా ఎన్నికలు పూర్తి చేయాలి

18-12-2025 12:00 AM

ఎన్నికల జిల్లా పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం 

నిర్మల్ డిసెంబర్ (17 విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం బుధవారం, జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భైంసా, బాసర, ముధోల్, తానూరు మండలాల్లో ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న పోలింగ్ సరళిని చూశారు. ఓట్లు వేయడానికి వచ్చిన ఓటర్లకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో పరిశీలించారు. అధికారులతో మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పకడ్బందీగా పూర్తి చేయాలని అన్నారు.