4 July, 2026 | 9:15 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

మొద్దు నిద్రలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే

06-02-2026 12:06 AM

రెవెన్యూ అధికారులు.. కార్పొరేటర్ కొంతం 

సికింద్రాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): కంటోన్మెంట్ నియోజకవర్గ మొండా డివిజన్ వెస్ట్ మారేడుపల్లి లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్‌లు పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక కార్పొరేటర్ కొంత దీపిక ఆరోపించారు.నిర్మాణం చేపట్టి ఏళ్ల కాలం గడిచిన రెండో దశ పంపిణీ ఎం దుకు చేయలేదు వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో అనేక అక్రమ లావాదేవీలు జరిగి చేతులు మారినట్లు ఆమె ఆరోపించారు.

అందులో భాగంగానే రెండోదశ ఇం డ్ల పంపిణీ కార్యక్రమం ఆలస్యం అవుతోందని ఆమె వెల్లడించారు. ఈనెల 10వ తేదీ లోపు ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని కార్పొరేటర్ కొంతం దీపిక డిమాండ్ చేస్తూ మారేడు పల్లి డబల్ బెడ్ రూమ్ ప్రాంగణంలో నిరాహార దీక్ష చేపట్టారు. స్థలాలు కోల్పోయి, భవనాల నిర్మాణానికి స్థలం ఇచ్చిన నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదని కార్పొరేటర్ ఆరోపించారు. ఇప్పటికైనా డబల్ బెడ్ రూమ్ లో పంపిణీ కార్య క్రమంలో పారదర్శకత పాటించాలని లేదం టే మరో ఉద్యమం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు,బిజెపి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.