15 June, 2026 | 9:30 PM

Breaking News

కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •  

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ

07-04-2026 12:00 AM

పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఎంపీ, ఎమ్మెల్యే వెల్లడి

ఆదిలాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): దేశంతో పాటు ధర్మ పరిరక్షకై ఏర్పాడిన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని న్యూ హౌజింగ్ బోర్డులో గల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ గోడం సగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, పార్టీ అధ్యక్షుడు బ్రహ్మనంద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతమాత, శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాలు ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎండీ గోడం నగేష్ మాట్లాడుతూ... దూరదృష్టితో అనాదు జనసంఘ్ పార్టీ ఏర్పడి కాలక్రమేనా బీజేపీగా అవితరించిందన్నారు. పార్టీ నిర్మాణం, ప్రజాస్వామ్య పరిరక్షణ, నితీ, నిబద్ధతతో కూడిన బీజేపీలో పని చేయడం గర్వకారణమన్నారు. ప్రతి దేశ పౌరునికి భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో బీజేపీ అవతరించిందన్నారు. అనాడు వాజ్పేయి... నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో నీతివంతమైన పరిపాలన సాగుతుందన్నారు. బీజేపీని మరింత బలోవేతం చేసేందుకు యువత పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. 

ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... అనాడు ఐదుగురు సభ్యులతో ప్రారంభమై నేడు కోట్లది మంది సభ్యుల తో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని గుర్తు చేశారు. బీజేపీలో పని చేయడం అంటే దేశ రక్షణకు నైన్యంలో పని చేసినంత తృప్తి లభిస్తుందన్నారు. ఇప్పటికే 8 మంది ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు గెలుపొందగా తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కౌన్సిలర్ల సంఖ్య నైతం వెరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో బీజేపీ రానున్న ఎన్నికల్లో తెలంగాణాలో నైతం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశా రు. ఈ కార్యక్రమంలో నాయకులు బోయ ర్ విజయ్, వేదా వ్యాన్, జోగు రవి, పోశన్న, గంట జీవన్, బోడిగాం శ్రీకాంత్, రాకేష్, నగేశ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.