14-02-2026 02:54:24 PM
అతి త్వరలోనే రైతు భరోసా
హైదరాబాద్: రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల(Telangana Municipal Elections) ఫలితాల జోష్లో ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. అతి త్వరలోనే రైతు భరోసాను విడుదల చేయనుంది. ఈ నెల 17వ తేదీన రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ. 9 వేల కోట్లను ప్రభుత్వం సమీకరించింది. శనివారం సాయంత్రం 6 గంటలకు తన నివాసంలో మంత్రులతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.