13 May, 2026 | 12:56 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

మహాశివరాత్రి వేడుకలు ప్రారంభం

14-02-2026 02:30 PM

హనుమకొండ, ఫిబ్రవరి 14( విజయ క్రాంతి):మహా శివరాత్రి వేడుకల(Mahashivratri celebrations) సందర్భంగా వరంగల్‌లోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ రుద్రేశ్వర స్వామి (వెయ్యి స్తంభాల ఆలయం) లో శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి శ్రీ రుద్రేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. 

ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. అనంతరం లోకకల్యాణార్థం నిర్వహించిన పార్వతి పరమేశ్వరుల కళ్యాణం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనం చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి నాయిని నీలిమ రెడ్డి, కుమార్తె డా. శ్రీగోదా విష్ణురెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, మణికంఠ శర్మ తదితరులు పాల్గొన్నారు.