14-02-2026 02:30:07 PM
హనుమకొండ, ఫిబ్రవరి 14( విజయ క్రాంతి):మహా శివరాత్రి వేడుకల(Mahashivratri celebrations) సందర్భంగా వరంగల్లోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ రుద్రేశ్వర స్వామి (వెయ్యి స్తంభాల ఆలయం) లో శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి శ్రీ రుద్రేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. అనంతరం లోకకల్యాణార్థం నిర్వహించిన పార్వతి పరమేశ్వరుల కళ్యాణం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనం చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి నాయిని నీలిమ రెడ్డి, కుమార్తె డా. శ్రీగోదా విష్ణురెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, మణికంఠ శర్మ తదితరులు పాల్గొన్నారు.