సాలూర ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
02-06-2026 07:04 PM
సాలూర(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాలూర రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం రోజున వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సాలుర మండల ఎమ్మార్వో నవాజ్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో నవాజ్ మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రం సిద్ధించిందని, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఉద్యోగి, అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.






