క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
10-04-2026 03:10 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఐపీఎల్ క్రికెట్ పోటీలపై ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకుడు గట్ల రాజేష్ తో సహా 11 మందిని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి లక్ష ఆరువేల రూపాయల నగదు, 12 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏ సీ పీ మధుసూదన్ వెల్లడించారు. హనుమకొండ, జనగామ, వరంగల్ తదితర ప్రాంతాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు తెలిపారు.




