30 July, 2026 | 9:01 PM

Breaking News

భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టు, వంతెనను పరిశీలించిన ఐటీడీఏ పిఓ   •   ఉట్నూర్ లోని ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే..   •   పరవళ్లు తొక్కుతున్న గుండారం రిజర్వాయర్ మత్తడి   •   విద్యుత్‌ సరఫరాలో మునుగోడును రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలి   •   అంగన్వాడీ టీచర్లు, ఆయాల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి   •   ఘనంగా సోనుసూద్ జన్మదిన వేడుకలు: బలగం శ్రీధర్   •   టి జేఏసీ జిల్లా చైర్మన్‌కు రంగానాయక్ కుటుంబం అభినందనలు   •   భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి   •   ఉమ్మడి జిల్లా డైరెక్టర్ హీనా బేగంకు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి సన్మానం   •   ప్రభుత్వ పాఠశాలలోకి వరద నీరు   •  

బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్

30-07-2026 07:49 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసినట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే ఉప్పల్ గాంధీనగర్ కు చెందిన బాకారం అరుణ్ మహేష్,  (38) అనే వ్యక్తి పీర్జాదిగూడలో శ్రీబాలాజీ సిమెంట్ బ్రిక్స్ పేరుతో సిమెంట్ బ్రిక్స్ తయారీ షెడ్‌ను నిర్వహిస్తున్నాడు. సదరు వ్యక్తి తన సిమెంట్ బ్రిక్స్ తయారీ ప్లాంట్‌లో బాల కార్మికులను పనిలో నియమించినందుకు 2024 సంవత్సరంలో ఒక కేసు, జూలై–2026లో మరో కేసు నమోదు చేయబడిందని తెలిపారు.

అదేవిధంగా 2025 సంవత్సరంలో మరో కేసు నమోదు అయిందని  పై కేసులన్నీ ప్రస్తుతం  న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ పై కేసులు నమోదైన తరువాత కూడా సదరు వ్యక్తి తన ప్రవర్తనలో ఎటువంటి మార్పు చేసుకోకుండా తన సిమెంట్ బ్రిక్స్ తయారీ షెడ్‌లో బాల కార్మికులను నియమించి పనులు చేయిస్తున్నాడు.  కావున సదరు వ్యక్తి కార్యకలాపాలు, కదలికలను నిరంతరం గమనిస్తూ, భవిష్యత్తులో చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టుటకు అతనిపై సస్పెక్ట్ షీట్ తెరవడం జరిగిందని మేడిపల్లి పోలీసులు తెలిపారు.