టి జేఏసీ జిల్లా చైర్మన్కు రంగానాయక్ కుటుంబం అభినందనలు
తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలానికి చెందిన మందడి ఇజ్రాయిల్ను తెలంగాణ జేఏసీ ఖమ్మం జిల్లా చైర్మన్గా నియమించిన సందర్భంగా మండలానికి చెందిన బానోత్ రంగనాయక్ దంపతులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చేతి గడియారాన్ని బహుకరించి, అల్పాహారం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ జిల్లా టి జేఏసీ చైర్మన్గా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు జిల్లాలో మంచి కార్యక్రమాలకు తోడ్పడాలని,
న్యాయపరమైన హక్కులను సాధిస్తూ రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.మందడి ఇజ్రాయిల్ నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా సామాజిక న్యాయం, ప్రజా హక్కుల పరిరక్షణలో టి జేఏసీ కీలక పాత్ర పోషించాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపే దిశగా నిరంతరం సేవలందించాలని కోరుతూ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బానోత్ సుజాత డాక్టర్ లావణ్య, ఉపేందర్, వనిత, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు.






