పిఆర్టియు టిఎస్ మండల అధ్యక్షులుగా సురేష్ రెడ్డి ఎన్నిక
భూత్పూర్: పిఆర్టియు టిఎస్ భూత్పూర్ శాఖ నూతన కార్యవర్గం సోమవారం ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా ఆర్. సురేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఏ. సాయిరాం గౌడ్, అసోసియేట్ అధ్యక్షులుగా బాల్ లింగయ్య, మహిళా అసోసియేట్ అధ్యక్షులు జి. లక్ష్మి, ఉపాధ్యక్షులు వెంకటయ్య, ఆంజనేయులు, మహిళా ఉపాధ్యక్షులు సమతాదేవి, జ్యోతి, కార్యదర్శి బాల్ రెడ్డి, నితిన్, మహిళా కార్యదర్శిగా ప్రభావతి, పద్మమ్మలను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, బుచ్చారెడ్డి పాల్గొని ఉపాధ్యాయ సమస్యలపై ప్రసంగించారు. ఈ ఎన్నికకు ఎన్నికల అధికారులుగా నాగేశ్వర్ రెడ్డి, భాస్కర్ వ్యవహరించారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఒప్పులు యాదయ్య, లింగం గౌడ్, కృష్ణ, శశిధర్ గౌడ్ అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






