అప్పంపల్లిలో బెల్లం నాగన్న విగ్రహ ప్రతిష్ఠాపన
24-08-2026 08:04 PM
కౌకుంట్ల: అప్పంపల్లి గ్రామంలో తెలంగాణ విమోచన ఉద్యమకారుడు బెల్లం నాగన్న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విమోచన ఉద్యమంలో బెల్లం నాగన్న చేసిన పోరాటం, త్యాగం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






