24 August, 2026 | 11:52 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి

24-08-2026 09:42 PM

తనిఖీలో గమనించిన పలు ఉల్లంఘనలు

కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని డైట్ క్యాంటీన్‌ను తనిఖీ ఆకస్మికంగా చేశారు. ఈ సందర్భంగా ఆహార భద్రతా అధికారి మాట్లాడుతూ తనిఖీలో పలు విషయాలను గమనించినట్లు తెలిపారు. అందులో భాగముగా ముడి పదార్థాల కోసం సరైన ఆహార నిల్వ సౌకర్యం లేదని, ఆహార పదార్థాలను నిర్వహించేవారు టోపీలు, చేతి తొడుగులు ధరించలేదని అన్నారు. అంతేకాకుండా ఆహార పదార్థాలను నిర్వహించేవారికి వైద్య ధృవపత్రాలు లేవని పేర్కొన్నారు. ఈ మేరకు కాంట్రాక్టర్‌కు నోటీసు జారీ చేసి, నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించడం జరిగిందని ఈ సందర్భంగా ఆహార భద్రతా అధికారి వరుణ్ రెడ్డి తెలిపారు.