2 May, 2026 | 7:23 PM

Breaking News

డి.ఎస్.పి మహేందర్ రెడ్డికి ఎస్పీ అభినందనలు   •   రఘునాథ బంజరలో కొత్తగా మట్టి రోడ్డు ఏర్పాటు   •   ప్రజా పాలనతో దేశంలో ముందంజలో తెలంగాణ   •   అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి   •   మహిళాల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •  

ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆదుకోండి

10-10-2025 01:00 AM

రాష్ట్ర మాల మహానాడు సభ్యులు కొండి స్వామి

చేగుంట, అక్టోబర్ 9 :పంచాయతీ సెక్రెటరీ వల్ల ఆత్మహత్య చేసుకున్న కొండి లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర మాల మహానాడు సభ్యుడు కొండి స్వామి డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ లక్ష్మి భర్త అంజయ్య చేగుంట తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 97లో సర్వే చేసి ఎకరం భూమి పట్టా పాస్ బుక్ త్వరగా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తహసీల్దార్ స్పందిస్తూ ఈ విషయం ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.