6 July, 2026 | 4:08 PM

Breaking News

ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •  

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

12-02-2026 12:47 PM

ప్రైవేటు పాఠశాల వార్షిక ఆటల పోటీల ప్రారంభోత్సవంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు

మంథని, మహాదేవపూర్,(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(TPCC General Secretary Srinu Babu) అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని ప్రైవేటు పాఠశాల వార్షిక ఆటల పోటీలను  శ్రీనుబాబు గురువారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువు తో పాటు ఆటోల్లో కూడా రాణించాలని కోరారు. ఆటల్లో రాణించి ఊరికి, పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు,  పాఠశాల కరెస్పాండెంట్ తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.