12-02-2026 12:50:32 PM
సి.పి. యస్.ఉపాధ్యాయ,ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు
నిర్మల్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందికి పూర్తి రెమ్యునరేషన్ చెల్లించకుండా కోత విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అధికారులు హుందాగా వ్యవరించాలని సి.పి. యస్.ఉపాధ్యాయ,ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు పేర్కొన్నారు. అనేక ఇబ్బందుల మధ్యన విధులు నిర్వహించి,ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసి,ప్రభుత్వ ప్రతిష్ట పెంచామని.. అయినా కూడా కొందరు అధికారులు తమకు రావాల్సిన రెమ్యునరేషన్ ను తగ్గించి ఇవ్వడం సబబు కాదని అన్నారు. ఎన్నికల వచ్చినప్పుడల్లా అధికారుల తీరుతో విసిగి పోతున్నామని అన్నారు.
పూర్తి రెమ్యునరేషన్ ను ఉపాధ్యాయులకు వీలైనంత తొందరలో చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంత్రులకు ,అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. కొన్ని చోట్ల సిబ్బందికి సరైన భోజనం కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు ఇలాంటి విషయాల్లో హుందాగా ఉండాలని కోరారు. రాత్రి వరకు విధుల్లో ఉన్న సిబ్బంది అనేక సమస్యలు ఎదుర్కొన్నారని అన్నారు.