పదో తరగతిలో 569 మార్కులు సాధించిన విద్యార్థినికి సన్మానం
09-05-2026 12:14 AM
భిక్కనూర్, మే 8(విజయ క్రాంతి): పదో తరగతి పరీక్షల్లో 569 మార్కులు సాధించిన భూమని ప్రణయ శ్రీ ను కాచాపూర్ మాజీ సర్పంచ్ పెండ్ల భూపతి అభినందించి సన్మానించారు. ప్రణయ్ శ్రీ . జ్యోతిబాపూలే జంగంపల్లి పాఠశాలలో చదువుకుంది. ఈ సందర్భంగా ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థిని ప్రతిభపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.






