08-02-2026 06:28:34 PM
జాతీయ స్థాయికి ఎంపికైన హేమన్
పాపన్నపేట: రాష్ట్ర స్థాయి అబాకస్ పరీక్షలో పాపన్నపేట శ్రీ విద్య స్కూల్ విద్యార్థి టి.హేమన్ ద్వితీయ ర్యాంక్ సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలు ఆదివారం నిర్వహించారు. ఇందులో వివిధ జిల్లాలకు చెందిన 580 పాఠశాల నుండి 806 మంది విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొన్నారు. శ్రీ విద్య పాఠశాల నుండి ఐదు కేటగిరీలలో విద్యార్థులు పాల్గొని పరీక్షలు రాయగా స్టార్ జూనియర్ లెవెల్ వన్ లో హేమన్ ద్వితీయ ర్యాంక్ సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు.
హార్దిక్ రామ్ 4వ ర్యాంక్ సాధించారు. స్టార్ జూనియర్ లెవల్ త్రీలో రోహిత్ జీనియస్ బహుమతి సాధించారు. జూనియర్ క్యాటగిరి వన్ లో ఆర్ శ్రీజ తృతీయ ర్యాంక్ సాధించిగా.. జూనియర్ కేటగిరి లెవెల్ 2 లో షీజా తనహి తృతీయ ర్యాంక్ సాధించింది. రాష్ట్ర స్థాయిలో జరిగిన పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ గుప్తా, కరస్పాండెంట్ నీఠలాక్షప్ప, సుమన్, ఉపాధ్యాయురాలు దుర్గ, ప్రియాంక, స్రవంతి, పల్లవి తదితరులు అభినందించారు.