12-02-2026 06:21:27 PM
కోదాడ: కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామంలోని సాయి మందిరంలో గురువారం విశేష పూజలు, అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గన్నా ఉపేంద్రమ్మ, వర్మ దంపతులు దేవాలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సాయి శర్మ, గురవయ్య, సత్యనారాయణ, హేమంత్ చౌదరి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.