14 August, 2026 | 8:45 PM

పోరాటంతో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం

14-08-2026 07:42 PM

ఆలేరు,(విజయక్రాంతి): టంగుటూరు గ్రామంలో ఏడాది కాలంగా ఉన్న లో వోల్టేజ్ సమస్యపై రైతులతో కలిసి చేపట్టిన పోరాటం ఫలించిందని గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్ తెలిపారు. రైతుల సమస్యను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దృష్టికి తీసుకెళ్లడంతో రూ.30 లక్షలతో ప్రత్యేక ఫీడర్ ఏర్పాటు చేశారని చెప్పారు. షారాజిపేట సబ్‌స్టేషన్‌లో నూతన ఫీడర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సర్పంచ్, సమస్య పరిష్కారానికి సహకరించిన ఎమ్మెల్యే, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.