చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్
14-08-2026 08:40 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు శుక్రవారం పట్టణ సీఐ సమ్మయ్య తెలిపారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు రాత్రి సమయంలో దొంగతనం నియంత్రణ కు పోలీస్ గస్తీ ఏర్పాటు చేస్తుందన్నారు. పట్టణంలో ఇటీవలి మూసిన్ ఖాన్ పుట్ట సప్న ఇద్దరు నిందితులు షాపుల్లో చోరీ చేసి ఫోన్లు రాగి తీగలు దొంగిలించాలని తెలిపారు. నిందితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా నిందితులను గుర్తించి పట్టుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. బైకు రాగి తీగలు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేయడం జరిగిందని వివరించారు.






