11-02-2026 03:30:21 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఓ విద్యార్థి తొలిసారి ఓటు వేసి తన అనుభూతిని పొందింది. పట్టణంలోని టేకుల బస్తి 16వార్డు కు చెందిన గోపతి శోక శ్రీ బజార్ ఏరియా జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తొలిసారిగా ఓటు వేసింది. బీటెక్ సెకండియర్ చదువుతున్న సదరు విద్యార్థిని తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన తండ్రి భూపతి జనార్దన్ తో కలిసి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చింది.