ఐఐటీలో శివాని కళాశాల ప్రభంజనం
విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): సోమవారం విడుదలైన ఐఐటీ అడ్వాన్స్డ్- ఫలితాల్లో హనుమకొండ బాలసముద్రంలోని శివాని జూనియర్ కళాశాల (శ్రీ మంజునాథ ఎడ్యుకేషనల్ సొసైటీ) విద్యార్థులు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి, అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దడం అందరికీ సాధ్యమేనని, కానీ సాధారణ విద్యార్థులను సైతం జాతీయ స్థాయి ర్యాంకర్లుగా మార్చడం ఒక్క శివాని కళాశాలకే సాధ్యమని గర్వంగా ప్రకటించారు.
జె. బాలకృష్ణ వ ర్యాంక్, జి. నిశాల్ -1329 వ ర్యాంక్, ఆర్. దాతు -1515 వ ర్యాంక్, బి. సిద్ధార్థ-2423 వ ర్యాంక్, బి. గణేష్-2927 వ ర్యాంక్లు సాధించారు. విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ టి. స్వామి, ప్రిన్సిపాల్స్ జి. సురేందర్రెడ్డి, వి. చంద్రమోహన్, మరియు డైరెక్టర్లు టి. రాజు, ఎన్. రమేష్, ఎ. మురళీధర్, వి. సురేష్, ఎస్. సంతోష్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.






