20-02-2026 01:30:04 AM
ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, ఫిబ్రవరి ౧9 (విజయక్రాంతి): హిందూ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సారంగాపూర్ మండలం మలక్ చించొలి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సనాత న ధర్మం కోసం శివాజీ మహారాజ్ చేసిన సేవ చిరస్మరణీయమని,
ఛత్రపతిని స్పూర్తి గా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, ముత్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, మండల అధ్యక్షులు నరేష్, నాయకులు గంగాధర్, మాజీ ఎంపీటీసీ కొరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.