13-02-2026 01:13:08 AM
ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి
ఆదిలాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడిన గజదొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశా రు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీసు హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలను వెల్లడించారు.
ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరుగుతున్న రాత్రి దొంగతనాలకు సంబంధించిన 7 కేసులను ఛేదిస్తూ గజదొంగ టేకం రామారావు ను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు ఉట్నూర్ మండలం నాగాపూర్ గ్రామంకు చెందినవాడని తెలిపారు.
ఇప్పటి వరకు నిందితుడిపై మొత్తం 36 కేసులు నమోదై ఉండగా, కరీంనగర్, సిద్దిపేట్ ప్రాం తాల్లో దొంగతనాలు చేసినందుకు గతంలో రెండు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి, జనవరి 6న విడుదలైన అనంతరం మళ్లీ ఉట్నూర్ మండలంలో వరుసగా ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. నిందితునునీ నుండి 11.4 తులాల బంగారం, 20 తులాల వెండి, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూ ర్ సీఐ ప్రసాద్, ఎస్సై గుంపుల విజయ్, పోలీస్ సిబ్బంది శ్యామ్ రావు, నరేష్, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.