2 July, 2026 | 2:57 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం

02-07-2026 01:59 PM

ముత్తారం, జూలై 02(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని జిల్లాలపల్లి  గ్రామపంచాయతీ సమీపంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు చొప్పరి నారాయణకు చెందిన గౌడ్ గేదె విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. వ్యవసాయ భూమి సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవాహం తగలడంతో గేదె ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రైతుకు సుమారు రూ.70 వేల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. సంఘటన విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకుని రైతును ఓదార్చారు. విద్యుత్ శాఖ అధికారులు ఘటనపై విచారణ జరిపి, నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.