ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత సమస్య పరిష్కరించాలి
20-06-2026 05:55 PM
కరీంనగర్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత సమస్య పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల బృందం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ... కరీంనగర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఏర్పడి లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ఇసుక సరఫరా సమస్యను పరిష్కరించి నిర్మాణాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపై సానుకూలంగా స్పందించిన ఆర్డీవో సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.






