22 April, 2026 | 7:44 PM

మరోసారి మానవత్వం చాటిన సాయికృష్ణ

22-04-2026 06:09 PM

బెజ్జంకి,(విజయక్రాంతి): కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ హార్ట్ సర్జరీ చేయించుకున్న ఊట్ల మల్లయ్యకి అత్యవసరంగా రక్తం అవసరమవగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన సాయికృష్ణ వెంటనే స్పందించి రక్తదానం చేశారు. ఇప్పటివరకు 13 సార్లు రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచిన సాయికృష్ణ సమాజ సేవలో ఎప్పుడూ ముందువుంటారు. అవసరమైనప్పుడు వెంటనే స్పందించడం తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు. యువత రక్తదానంపై అవగాహన పెంపొందించి, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అత్యవసర సమయంలో మానవత్వాన్ని చాటిన సాయికృష్ణ ని స్థానికులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, యువజన నాయకులు అభినందించారు.