20 June, 2026 | 7:12 PM

Breaking News

ఫీజులు నియంత్రించకపోతే ఆందోళ తప్పదు   •   నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •  

గోదావరిఖనిలో త్వరలోనే సదర్ వేడుకలు

01-11-2025 06:25 PM

శ్రీకృష్ణ యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకల శ్రీధర్ యాదవ్

గోదావరిఖని (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో త్వరలోనే సదర్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణ యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకల శ్రీధర్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం మొట్టమొదటిసారిగా గోదావరిఖనిలో సదర్ వేడుకలు ప్రారంభించామని, ఈ ఏడు కూడా మన యాదవుల కోరిక మేరకు మళ్లీ గోదావరిఖనిలో యాదవుల సహకారంతో పెద్దఎత్తున సదర్ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు శ్రీధర్ యాదవ్ తెలిపారు. ఈ సదర్ వేడుకలకు జిల్లాలోని, గోదావరిఖనిలోని యాదవులు సహాయక సహకారాలు అందించాలని ఆయన ప్రకటనలో కోరారు.