2 July, 2026 | 2:28 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

కోనరావుపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు –అన్నదాతల అవగాహన కార్యక్రమం

06-05-2026 05:25 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – అన్నదాతల అవగాహన” కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మస్కూరి కాశీరాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రైతులకు తక్కువ యూరియా వినియోగం, పంట మార్పిడి, సాగు నీటి సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం, అవసరమైన మేరకే రసాయనాల వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

అలాగే వానాకాలంలో సన్న రకాల వరి సాగు చేసి ప్రభుత్వ బోనస్ పొందాలని, ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు మళ్లాలని సూచించారు. కార్యక్రమంపై రైతులు సానుకూలంగా స్పందించి తమ అభిప్రాయాలు వెల్లడించారు.