కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగండ్ల దీపక్ చౌదరి
06-05-2026 05:19 PM
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన దివాకర్ టిఎస్ ని బుధవారం ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ మర్యాదపూర్వకంగా కలిశారు. డిసిసి ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి ఆధ్వర్యంలో కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో పలు డివిజన్ లలో నెలకొన్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.






