2 July, 2026 | 2:57 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి

02-07-2026 01:56 PM

బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్

సిద్దిపేట రూరల్ (విజయక్రాంతి): సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘాల సభ్యులు, రైతులు, ఉపాధి హామీ కూలీలు, పింఛన్ లబ్ధిదారుల ఖాతాలకు లాక్‌లు విధించడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రైతు భరోసా, వడ్ల, ఇతర సంక్షేమ పథకాల నిధులు, పింఛన్ నగదు ఖాతాల నుంచి తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పుల్లూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం ఇచ్చారు.  ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడి వీలైనంత త్వరగా అన్ని సమస్యలను పరిష్కరించి, అర్హులైన ఖాతాదారుల ఖాతాలపై ఉన్న లాక్‌లను వెంటనే తొలగించాలని, సరైన కారణం లేకుండా ఎవరికి కూడా ఖాతాలపై లాక్‌లు విధించవద్దని సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు శ్రీహరి, రాజు తదితరులు పాల్గొన్నారు.