21 May, 2026 | 3:15 PM

Breaking News

తెల్ల తెల్లవారుతుండగానే పల్లెల్లోకి పాఠశాలల ప్రచారం.. విత్తన కంపెనీల ప్రచార రతాలు   •   ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరం   •   ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి..   •   ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకం   •   ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్   •   అనుమతి లేని ప్రైవేట్, విద్యాసంస్థలను మూసివేయాలి   •   కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్త్ టాపర్ కు సైకిల్ బహుకరణ...   •   జైనూర్‌లో చలివేంద్రం – అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు...   •   ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు   •  

గ్రామాభివృద్ధి ఏకైక లక్ష్యం

23-12-2025 12:24 AM

చిన్యా తండా సర్పంచ్ హరిచంద్

కేసముద్రం, డిసెంబర్ 22 (విజయక్రాంతి): గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్యా తండా గ్రామ సర్పంచ్ జాటోత్ హరిచంద్ తెలిపారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఇనుగుర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి బండారు పార్థసారథి సర్పంచ్ హరిచంద్ చేత పదవి ప్రమాణం చేయించారు. అనంతరం ఉపసర్పంచ్ గుగులోతు కవిత, వార్డు సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా స ర్పంచ్ హరిచంద్, మాజీ సర్పంచ్ అరుణను వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. అనంతరం హరిచంద్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చే స్తానని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో తన భార్య అరుణను, ఈసారి తాను సర్పంచ్ గా ఎన్నుకున్న గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.