10 May, 2026 | 1:42 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పరిశీలిన

09-02-2026 12:00 AM

ఆదిలాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, ఇతర శాఖల ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న తీరును పర్యవేక్షించారు. బ్యాలెట్ పేపర్ల భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని, ఓటింగ్ పూర్తున తర్వాత వాటిని నిబంధనల మేరకు భద్రపరచాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, ఎన్నికల నోడల్ అధికారి ఫణీందర్, మున్సిపల్ ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.