3 July, 2026 | 9:27 PM

Breaking News

రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •  

వీధిదీపాలు ఏర్పాటు చేయాలని వినతి

14-04-2026 01:01 AM

మేడ్చల్ అర్బన్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): మేడ్చల్ డివిజన్ పరిధిలోని గిర్మాపూర్ లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని బిజెపి మాజీ అధ్యక్షుడు కొండం ఆంజనేయులు ముదిరాజ్ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. మేడ్చల్ సర్కిల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ డి ఈ కి వినతిపత్రం అందజేశారు. వీధి దీపాలు లేక గిర్మాపూర్ లో అంధకారం ఏర్పడిందని తెలిపారు.

అంతేగాక సిసి రోడ్డు మీద గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందిగా తయారందని తెలిపారు. మేడ్చల్ పట్టణంలో గ్రంథాలయం వద్ద రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు బొక్క అంజిరెడ్డి, బండి విష్ణు గౌడ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి బి రాఘవరెడ్డి, రాగం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.