29 June, 2026 | 7:31 PM

ఫీజులను నియంత్రించాలని వినతిపత్రం

29-06-2026 06:31 PM

భైంసా(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించి పాఠశాలలో ప్రైవేటు పుస్తకాలు స్టడీ మెటీరియల్ అమ్ముతున్న వారిపై చర్య తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ సోమవారం బైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. పట్టణంలో అనేక విద్య సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దిగంబర్ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పాల్గొన్నారు.