ఏజెన్సీలో వట సావిత్రి వ్రత పూజలు
29-06-2026 06:28 PM
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని మహిళలు మర్రి చెట్ల వద్ద వట సావిత్రి పూజలను చేశారు. సోమవారం ఉదయం ఉట్నూర్ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని మహిళలు మర్రి చెట్లకు వద్దకు వెళ్లి తమ మాంగల్యం కలకాలం భద్రంగా ఉండాలంటూ.. ప్రత్యేక పూజలు చేసి మర్రి చెట్టుకు దారాలతో ప్రదక్షిణలు చేశారు. ఉట్నూర్ మండలం తో పాటు ఇంద్రవెల్లి, గాదిగూడ, నార్నూర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.






