17 April, 2026 | 9:34 PM

Breaking News

జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •  

ఎర్రకుంట స్మశాన వాటికలో చెట్ల తొలగింపు

17-04-2026 07:58 PM

ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం డివిజన్ ఎర్రగుంట స్మశాన వాటికలోని  పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలను నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి తన సొంత ఖర్చులతో  జెసిబి ద్వారా తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు కోట్ల వ్యయంతో ఎర్రకుంట స్మశాన వాటిక వైకుంఠ దామాగా నిధులు మంజూరు అయి ఉన్నాయని, ఎండిపోయిన పిచ్చి చెట్లు మట్టి కుప్పలుతో ప్రజలు స్మశాన వాటికలో అంత్యక్రియలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు.

స్మశాన వాటిక నూతన కమిటీ స్థానికులు తెలిపారని దీంతో తన సొంత ఖర్చులతో స్మశాన వాటికలో ఉన్న పిచ్చి మొక్కలను మట్టికుప్పలను తొలగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. త్వరలోనే అధికారులు వైకుంఠధామ నిర్మాణ పనులు  చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు  సాయిజెన్ శేఖర్ స్మశాన వాటిక నూతన కమిటీ అధ్యక్షులు మూర్తి నాగరాజు ఎడ్ల కార్తీక్ కొమ్మ గళ్ళ కౌశిక్ మనోజ్ సందీప్ పాల్గొన్నారు.