24 April, 2026 | 2:52 AM

ఎండతీవ్ర నుంచి భక్తులకు ఉపశమనం

24-04-2026 12:00 AM

వెంకటాపూర్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఎండతీవ్రత అధికమవుతున్న నేపథ్యంలోమండలంలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆలయ ప్రాంగణంలో ట్యాప్స్ నుండి మెట్ల వరకు గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేసి భక్తులకు ఉపశమనం కల్పించారు.

ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేపట్టగా, ఎండ వేడిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న భక్తులకు ఇవి ఉపయోగకరంగా మారాయి. భక్తుల సౌకర్యం కోసం అవసరమైన మరిన్ని చర్యలు కూడా కొనసాగిస్తామని ఈవో భాస్కర్ తెలిపారు.