15 June, 2026 | 7:19 PM

Breaking News

అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •  

కష్టపడ్డ వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు

17-03-2026 01:14 AM

మంత్రి జూపల్లి సమక్షంలో బీఆర్‌ఎస్, బీజేపీ నేతల చేరిక

ఆదిలాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బోథ్ నియోజకవర్గంలోని బజార్హత్నూర్, సోనాల మండలాలకు చెందిన బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల కీలక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాద వ్, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, బోథ్ నియోజకవర్గ కాం గ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్ ఆధ్వర్యంలో  హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి మంత్రి, సాద రంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ.. బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఈ చేరికలు దోహ దపడతాయని, కష్టపడే కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.