భూ బాధితులతో ఆర్డీవో సమావేశం
రామాయంపేట: రామాయంపేట మీదుగా వెళుతున్న జాతీయ రహదారి బైపాస్ లో భూములు కోల్పోతున్న రైతులతో మెదక్ ఆర్డీవో రమాదేవి శనివారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతుల నుండి అభిప్రాయాలను సేకరించడం జరిగింది. అనంతరం పట్టణంలోని పదవ తరగతి పరీక్షల నిర్వహించి కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు ఎక్కడ కూడా తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదని అన్నారు.
నేడు మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అదే సంకల్పంతో సాధించిన విజయాలను మర్చిపోకుండా మరింత ఉన్నత శిఖరాలను ఇరగడానికి కృషి చేస్తూనే ఉండాలన్నారు. మహిళ సంకల్పం చాలా గొప్పదని సమాజానికి ఉపయోగపడే విధంగా తమ మేధస్సును ఉపయోగించాలని ఆదర్శంగా నిలబడి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పనులు చేయాలని ఆమె అన్నారు.




