20-02-2026 10:12:29 AM
వ్యవసాయ శాఖ నైస్ వెరీ గుడ్
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితుమ్మలకు రాహుల్ కితాబు
సత్తుపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ అభివృద్ధి విజన్ ని మరింత వేగవంతం చేయాలని సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర క్యాబినెట్ సహచరులు రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులతో గురువారం నాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Rahul gandhi) పనితీరుపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కితాబు ఇచ్చారు. తుమ్మల జి ఓకే వ్యవసాయ శాఖ పెర్ఫార్మెన్స్ నైస్ గుడ్ అని స్పష్టంగా తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసిసి అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకులు ఉన్నారు.