10 May, 2026 | 12:15 AM

Breaking News

కరీంనగర్ బంద్ ప్రశాంతం   •   దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •  

మెరుగైన వైద్యసేవలు అందించండి

07-01-2026 12:09 AM

తహసీల్దార్  కె.ఎల్లన్న  

చిన్న చింతకుంట,  డిసెంబర్ 6 : ఆరోగ్యం బాగాలేదని వచ్చిన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించేలా కృషి చేయాలని తాసిల్దార్ కే ఎల్లన్న అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను  ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించి, పేషంట్ల నమోదు, ప్రసవాలు, రక్త పరీక్షల తీరు,

ఇతర అంశాలపై  అదేవిధంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రోగుల ఓపీ రిజిస్టర్ సిబ్బంది మూమెంట్ అటెండెన్స్ రిజిస్టర్ ప్రసూతి   వ్యాక్సిన్ మందుల గదులను పరిశీలించారు దవాఖానలో నాణ్యమైన వైద్యం అందిస్తు న్నారా లేద అని రోగులను అడిగి తెలుసు కున్నారు రోగులకు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని, వైద్య అధికారి శిరీషను తహసీల్దార్ సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎల్లన్న, మండల గర్థవర్లు తిరుపతయ్య,ఎండి అమేర్ పాల్గొన్నారు.