11 May, 2026 | 11:28 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

పసిపాప మృతి కారకులను కఠినంగా శిక్షించాలి

23-02-2026 09:24 PM

రజక సంఘాల ఆధ్వర్యంలో నిరసన

మణుగూరు,(విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్‌ జిల్లా కమ్మెర గ్రామంలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబంపై దాడిచేసి, రెండు నెలల పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రజక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. సోమవారం  పట్టణంలోని సురక్ష బస్టాండ్ నుండి అంబేద్కర్ కూడలి వరకు బీసీ జేఏసీ, రజక సంఘాల ఆధ్వర్యంలో పసిపాప మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ... రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబంతో మల్లన్న దేవుని దర్శనానికి వెళుతుండగా కొంతమంది అగ్రకులానికి చెందిన వారు అడ్డుకొని, రెండు నెలల పసికందు ఉందని కూడా చూడకుండా దాడికి పాల్పడటంతో పాప మృతి చెందిందన్నారు. ఇందుకు కారకు లైన వారిని కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.నిరసన కు బీసీ సంఘాలు, టీఆర్పీ పార్టీ మద్దతు తెలిపారు.