నాయకన్ గూడెంలో ప్రభుత్వ భూములను కాపాడండి
27-08-2026 08:39 PM
తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు
కూసుమంచి,(విజయక్రాంతి): మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను, ప్రభుత్వ కుంటలను, ఆక్రమించుకున్నారని, రెవిన్యూ అధికారులు తక్షణమే ప్రభుత్వ భూములను సర్వే చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ.. సిపిఎం గ్రామశాఖ కార్యదర్శి కర్ణబాబు, సిపిఎం నాయకులు గురువారం తహసిల్దార్ సైదులుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గడ్డం మురళి, సింగం సోమయ్య, సింగం కృష్ణంరాజు, ఎస్ కె ఖాసీ, తదితరులు పాల్గొన్నారు






