ప్రముఖ పేదల వైద్యులు మృతి
20-04-2026 04:20 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణానికి చెందిన సీనియర్, పేదల డాక్టర్ గా పేరు తెచ్చుకున్న మాజీ ప్రభుత్వ వైద్యులు వైద్యులు బాస సిద్ది రాములు(75) మృతి చెందారు. పట్టణంలోని ప్రియదర్శిని నగర్ కాలానికి చెందిన డాక్టర్ సిద్ధిరాములు నిర్మల్ ప్రభుత్వ వైద్యశాలలో ఎన్నో సంవత్సరాలు వైద్య సేవలు అందించి అందరి డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల నిర్మల్ వైద్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను తెచ్చుకుంటున్నారు.






