30 June, 2026 | 7:53 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

క్రీడాకారులకు బహుమతుల ప్రదానం

18-02-2026 12:00 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): గత డిసెంబర్ నెలలో టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో 12వ క్రీడా ఉత్సవాలు నిర్వహించారు. విజయం సాధించిన ఉద్యోగ క్రీడాకారులకు మంగళవారం టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో బహుమతులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రదానం చేశారు. టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ ఎం హుస్సేనీ (ముజీబ్) హాజరయ్యారు.

టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కుమార్ కార్యదర్శి, కురాడి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సూచన మేరకు హైదరాబాద్ జిల్లా, సిటీ కార్యాలయంకు వెయ్యి గజాలు స్థలం కేటాయించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారు.

కార్యక్రమంలో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, సిటీ అధ్యక్షులు శ్రీకాంత్, ఖమ్మం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండల్ రెడ్డి, నజీర్ పాషా, గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి శైలజ, హైదరాబాద్ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ కె.ఆర్ రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ నరేష్, ఖలీద్, శంకర్, జాయింట్ సెక్రెటరీ గీత, ప్రచార కార్యదర్శి వైదిక శాస్త్ర, కార్యవర్గ సభ్యులు ముకీంఖురేషి, ఏవీ శ్రీధర్ పాల్గొన్నారు.