4 May, 2026 | 12:37 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు

04-05-2026 11:19 AM

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తిరుమలాయపాలెం మండలంలో సోమవారం (మే 4) నుంచి 9వ తేదీ వరకు ‘రైతు వారం’ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి (AO) సీతారాం రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం 9 గంటలకు మండలంలోని తిరుమలాయపాలెం, గోపాలపురం, దమ్మాయిగూడెం, బీరోల్, రాజారాం, కాకరవాయి, హస్నాబాద్, పాతర్లపాడు క్లస్టర్ల రైతు వేదికల వద్ద ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.

ఈ సదస్సుల్లో నేల ఆరోగ్య పరిరక్షణ, భూసార పరీక్షలు, సమతుల్య ఎరువుల వినియోగం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయం పద్ధతులు, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సన్న వరి రకాల సాగుపై నిపుణులు మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు మండలంలోని ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, రైతులు, అనుబంధ శాఖల అధికారులు భారీగా హాజరై విజయవంతం చేయాలని వ్యవసాయ అధికారి కోరారు. రైతులు తమ వ్యవసాయానికి సంబంధించిన సందేహాలను నేరుగా అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు.