డాక్టర్ల నిర్లక్ష్యం టైం కు రాని వైనం
04-05-2026 11:14 AM
ఆలేరు, మే 4 (విజయ క్రాంతి): ఆలేరు సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన టైం కి రాక గర్భిణీ స్త్రీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం టైముకు రాని వైనం సోమవారం ఉదయం 10:45 కు కూడా గర్భిణీ స్త్రీలను చూసే డాక్టర్ లేక ఈ ఎండాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై డాక్టర్ స్వప్న రాథోడ్ కి ఫోన్లో విజయక్రాంతి రిపోర్టర్ వివరణ అడగగా నేను లీవ్ లో ఉన్నాను అక్కడ ఇన్చార్జి వాళ్ళు ఉన్నారు. రౌండ్స్ లో ఉన్నారు అని సమాధానం ఇచ్చారు. కానీ ఆ టైము వరకు ఇంకా డాక్టరు డ్యూటీ కి రాలేదు, ఇకనైనా మీ నిర్లక్ష్య వైఖరి మానుకొని, సమయపాలనకు వచ్చి రోగులకు సరైన వైద్యం అందించాలని, ప్రజలు కోరుకుంటున్నారు.






