13 May, 2026 | 2:26 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

సీనియర్లు లక్ష సాధనలో ముందుండాలి

27-12-2025 09:02 PM

పోస్టల్ ఇన్స్పెక్టర్ వీరన్న

ములకలపల్లి,(విజయక్రాంతి): మండలంలోని తాళ్లపాయి బ్రాంచ్ కార్యాలయాన్ని  పోస్టల్ ఇన్స్పెక్టర్ మాలోత్ వీరన్న వార్షిక తనిఖీలో భాగంగా శనివారం పరిశీలించారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్రాంచ్ కార్యాలయంలో జరిగిన వివిధ లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. అంతేకాకుండా ఖాతాదారుల నుండి పాస్ పుస్తకాలను తెప్పించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బ్రాంచి పోస్ట్మాస్టర్ కు అనేక సూచనలు చేయటం జరిగింది.

గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో ఖాతాలను తెరచి కొత్తవారికి ఆదర్శంగా ఉండాలన్నారు. కార్యాలయంలో పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలకు సంబంధించి సమాచారాన్ని ప్రదర్శించే బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పెన్షన్లు, రైతు బీమా, రైతు బంధు వంటి నగదు లావాదేవీలను సైతం రైతులు, గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకునేలా వారిని చైతన్యం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఎస్ బి జి తిలక్ ఉన్నారు.